Pushpa 2: టాలీవుడ్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో పుష్ప ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది పుష్ప2 మూవీ. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆర్య మూవీతో మొదలైన వీరి జర్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు టాలీవుడ్లో టాక్. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉండగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. సుకుమార్ మీద ఉన్న కోపంతో అల్లు అర్జున్ తన గడ్డం తీసేసి టూర్ వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే బన్నీ షూటింగ్కు వచ్చేలోపు సుకుమార్ ట్రిప్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ విషయంలోని నిజానిజాలు తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు వీరి మధ్య నెలకొన్న వివాధం కారణంగా షూటింగ్ వాయిదా పడిందని, ఆగస్టు నుంచి డిసెంబర్కు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్లో అయినా విడుదల అవుతుందా లేక 2025లోకి వెళుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మూవీ షూటింగ్ జూలై చివరి నాటికి పూర్తిచేయాలని అల్లు అర్జున్ ఆర్డర్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షూటింగ్ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను సుకుమార్ రీడిజైన్ చేశారని, అందుకే ఆలస్యమవుతోందని సమాచారం. షూటింగ్ పొడిగించడంతో రిలీజ్ డేట్ మార్చాల్సి వస్తోంది. మరోవైపు వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాకపోవడంతో అవి పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశముంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.