Raj tarun tiragabadarasami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’ ఈ మూవీకి ఏఎస్ రవికుమార్ చౌదర్శి దర్శకం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషనల్ కంటెంట్కు సూపర్రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ట్రైలర్ను రిచ్గా లాంచ్ చేశారు.
పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో సాగిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ యాక్షన్ సన్నివేశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మెళవించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుంది. మునుపెన్నడూ కనిపించని యాక్షన్ సన్నివేశాల్లో రాజ్తరుణ్ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. తన ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ హైలీ ఎనర్జిటిక్గా కనిపిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్వారెక్టర్ ఈ మూవీలో డిఫరెంట్గా ఉంటుంది. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్గా సాగుతాయి.
డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి యాక్షన్, ఎమోషన్ను బ్యాలెన్సింగ్ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి. రాజ్ తరుణ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో డిఫరెంట్గా కనిపిస్తాడు. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. హై యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో అదరగొట్టిన ట్రైలర్ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.
ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంలో హీరో రాజ్ తరున్ మాట్లాడుతూ ఈ సినిమాకు అందరం ప్రాణం పెట్టి పనిచేశామని, అందరికంటే ఎక్కువ కష్టపడింది డీవోపీ జవహర్ రెడ్డి అని, ఆయన లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదని తెలిపారు. సినిమాలో తన క్యారెక్టర్ కొత్త పంథాలో చూపించడంపై నిర్మాత శివ, జేబీలకు కృతజ్ఞతలు తెలిపారు. మాల్వి ఈ మూవీలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పారు. ఈ మూవీ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. యాక్షన్ పార్ట్ చేయడం తనకు కొత్త అని, డైరెక్టర్ ప్రోత్సాహంతో చాలా ఈజీగా చేసినట్లు చెప్పారు. తిరగబడరసామీ త్వరలో థియేటర్స్లో వస్తుందని, అందరూ థియేటర్స్లో చూడాలని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ ఈ మూవీలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కథ చాలా బాగుందని, ఇందులో తనకు మంచి పాత్ర లభించిందని చెప్పారు. బాలకృష్ణ ఫ్యాన్గా కనిపిస్తానని, తనతో యాక్షన్ సీన్ కూడా ఉంటుందని వివరించారు. తెలుగులో తన మొదటి సినిమా ఇదే కావడం ఆనందంగా ఉందన్నారు. రాజ్ తరుణ్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తను అద్భుతమైన యాక్టర్ అని కొనియాడారు. సినిమాను థియేటర్స్లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ఏఎస్ రవికుమార్ చౌదరి కథ చెప్పిన వెంటనే చాలా బాగా నచ్చిందని, రాజ్ తరుణ్ హీరో అయితే బాగుంటుందని సినిమా స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. జేబీ అద్భుతంగా సంగీతం అందించారని తెలిపారు. మాల్వి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారని చెప్పారు. తాను ప్రతి మూవీలోనూ కొత్తవారిని పరిచయం చేస్తుంటానని, మాల్వి ఈ సినిమాలో చాలా బాగా చేశారని ప్రశంసించారు. టీం అంతా కలిసి పనిచేశారని తెలిపారు. రాజ్ తరుణ్ యాక్షన్ పాత్రలో కొత్తగా కనిపిస్తారని తెలిపారు. మూవీ మొత్తంగా సైలెంట్గా ప్రారంభమై వైలెంట్గా ముగుస్తుందన్నారు. ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్పాండే, రఘుబాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృథ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా
సంగీతం: జేబీ &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్: రవికుమార్ గుర్రం
ఫైట్స్ : పృథ్వి, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి