Minister Sitakka: నిర్మల్, అక్టోబర్ 16 (మన బలగం): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క గురువారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నీటిపారుదల ఆయకట్టు మరియు అభివృద్ధి శాఖ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా రూ.11.24 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వట్టివాగు రిజర్వాయర్ రక్షణ కరకట్ట పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణక్క, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కరకట్ట నిర్మాణానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. దీనితో వట్టివాగు ప్రాజెక్ట్ కనుమరుగు కాకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉందన్నారు.