birthday celebrations: నిర్మల్, ఫిబ్రవరి 16 (మన బలగం): నిర్మల్ జిల్లాలో ఆదివారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
దిలావర్పూర్లో..
దిలావరపూర్ మండలంలో డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహరి రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాల్వ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి రావు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తక్కల సాగర్ రెడ్డి, అరుగుల రమణ, అంగురు మహేందర్, గడ్డం నర్సారెడ్డి, దాసరి శ్రీహరి, అందకూరి నరేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిమ్మ సాయన్న, పూదరి శివకుమార్, గుమ్ముల నర్సయ్య, రవి, ఇప్ప నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్ మండలంలో..
సారంగాపూర్ మండలం అంతులవయి గ్రామంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళలకు ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిష్టు, మోహన్, రవి, రాజ్ కుమార్, రౌఫ్, ముఖీం, మాషి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద మండలంలో..
లక్ష్మణచాంద మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహరి రావు జన్మదిన వేడుకలను వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వోడ్నాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి రావు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నగేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, అట్ల చిన్న రామ్ రెడ్డి, సమ్మెట రవి, రజిని, అస్గర్, బీసీ మండల అధ్యక్షులు ముద్రవేనా వినేష్, డైరెక్టర్ సురేష్, గంగయ్య, భీమేష్, సుభాష్, బి.రమేష్, కల్లెడ భూమన్న, గుర్రాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ డీసీసీ క్యాంపు కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహరి రావు జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. సంతోషంగా ఒకరికొకరు తినిపించుకున్నారు. బాణసంచా పేల్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు, మహిళలకు బ్రేడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం డోవ్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, సారంగపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, తాజ మాజీ మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, గండి రామన్న సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్ గంగోని భూరాజ్, దేవరకోట దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, మాజీ జిల్లా జెడ్పికో ఆప్షన్ సభ్యులు అతీక్ అహ్మద్, మజర్, సభ కలీం, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి పోశెట్టి, కొట్టే శేఖర్, సందీప్, జిషాన్, ఈటల శ్రీనివాస్, సింధియా సోమేష్, తదితరులు పాల్గొన్నారు.
