Geetha Jayanti
Geetha Jayanti

Geetha Jayanti: శిశు మందిర్ పాఠశాలలో గీతా జయంతి

Geetha Jayanti: ముధోల్, డిసెంబర్ 11 (మన బలగం): ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్భగవద్గీత పుస్తకానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు. స్వాధ్యాయ భాయ్ సాబ్ జాదవ్ దత్తహరి పాల్గొని భగవద్గీత విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీతపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *