Attack with a knife: ముధోల్, డిసెంబర్ 11 (మన బలగం): మరదలిపై వదిన కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ముధోల్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి మాధవ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి హేమంత్ రావు భార్య అశ్విని హనుమంతరావు చెల్లెపై బుర్ఖా వేసుకుని కత్తితో దాడికి పాల్పడింది. స్థానికులు గమనించిన వెంటనే భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అశ్వినిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని సీఐ మల్లేశ్ పరిశీలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.