BJP celebrates: నిర్మల్, మార్చి 4 (మన బలగం): కరీంనగర్ -నిజామాబాద్- మెదక్- ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించడం పట్ల నిర్మల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలవడం చాలా సంతోషకరమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేధావుల ప్రజల సహకారంతో ఏర్పాటు చేయబోతుందని, మేధావి వర్గం ఈ తీర్పునివ్వడం జరిగిందని వారందరికి నిర్మల్ జిల్లా బీజేపీ శాఖ తరఫున దన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, మాజీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ్మె రాజు మరియు పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా కార్యదర్శి కోరిపల్లి శ్రవణ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరేంద్ర చారి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొండాజి శ్రవణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు అల్లం భాస్కర్, శ్రీరామోజీ నరేష్, టీచర్ ఎమ్మెల్సీ టౌన్ కన్వీనర్ ముడారపు దిలీప్, పట్టణ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.