- నిందితుడికి మూడెండ్ల జైలు శిక్ష
- మూడు వేల జరిమానా
- తీర్పునిచ్చిన న్యాయమూర్తి నీలిమ
Imprisonment: జగిత్యాల ప్రతినిధి, మార్చి 5 (మన బలగం): ప్రేమిస్తున్నానని వెంటపడి ఓ మైనర్ బాలికను వేధించిన సంఘటనలో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో జగిత్యాల కోర్టులో వాదనల పూర్తి అనంతరం న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఎట్టెం రవికి మూడెండ్ల జైలు శిక్షతోపాటు మూడు వేల జరిమాన విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన నిందితుడు ఎట్టెం రవి వయస్సు అనే వ్యక్తి ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేదించగా, మనస్తాపానికి గురైన ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో నిందితుడిపై పెగడపల్లి పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్ఐ శ్వేత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా, సాక్షులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ బుధవారం నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, మూడు వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారెవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ వేగవంతగా చేసి తప్పకుండ శిక్షలు పడేలా చేశారని అన్నారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణారావు, సీఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాగర్, సీఎంఎస్ కానిస్టేబుల్స్ శ్రీధర్, కిరణ్ కుమార్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.