Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ అనారోగ్యం బారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి ముంబైకి చేరుకున్నాడు. డీ హైడ్రేషన్కు గురైన షారూఖ్ బుధవారం అహ్మదాబాద్లోని కేడీ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. కోల్కతా వర్సెస్ హైదరాబాద్ క్వాలిఫయర్ మ్యాచ్కు హాజరైన ఆయన అకస్మాతుగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే దవాఖానకు తరలించారు. పూర్తిగా కోలుకున్న ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. గురువారం రాత్రి చార్టర్ విమానంలో ముంబైకి చేరుకున్నాడు. మీడియా కంటపడకుండా గొడుగుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న కింగ్ఖాన్ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలు ఆయన నివాసానికి తరలివచ్చారు. అయితే ఆయన ఎవరికీ కనిపించకుండా హడావుడిగా వెళ్లిపోయారు. ఆయనను చూడాలంటే మరికొన్ని రోజులు ఓపికపట్టక తప్పదేమో.
కాగా షారూఖ్ మేనేజర్ పూజా దద్లానీ షారూఖ్ బాగానే ఉన్నాడని వెల్లడించారు. షారూఖ్ వెంట గౌరీఖాన్, సుహానా, అగస్త్యనందా, అజయ్ దేవగన్, ఏక్నాథ్ షిండే ఉన్నారు. అహ్మదాబాద్ ఎస్పీ ఓం ప్రకాశ్ జాట్ మాట్లాడుతూ.. షారూఖ్ ఆస్పత్రి నుంచి విమానావ్రయానికి బయలుదేరాడని వెల్లడించారు.
అయితే దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో షారూఖ్ను కేకేఆర్ సహ యజమాని జూహీచావ్లా తన భర్త జేమెహతాతో కలిసి పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్ నిన్న రాత్రి అనారోగ్యంతో ఉన్నాడని, కానీ ఈ రోజు చాలా బాగున్నాడని వెల్లడించారు. దేవుడు కృపతో అతను త్వరగా కోలుకుంటాడని, త్వరలోనే స్టాండ్స్లో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైనల్స్ ఆడేటప్పుడు వచ్చి జట్టును ఉత్సాహ పరచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. షారూఖ్ తన కూతురు సహానాతో కలిసి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.