Awarding of prizes: ఇబ్రహీంపట్నం, జనవరి 13 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో యామపూర్ సహకార సంఘ చైర్మన్ అంకతి రాజన్న సౌజన్యంతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో 8 జట్లు పాల్గొన్నాయి. వినర్ అరె.నరేందర్ జట్టు, రన్నర్ పట్నం నవీన్ జట్లకు సోమవారం గ్రామపంచాయతి కళావేదికలో బహుమతులతోపాటు, షీల్డులు ప్రదానం చేసారు. క్యాష్ రివార్డులు అందజేశారు. అనంతరం నిర్వాహకులను యువజన సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెల్లి గంగారెడ్డి, నాయకులు సున్నం సత్యం, దేశెట్టి రాజరెడ్డి, అరె రమేశ్, కల్లెడ గణేశ్, అడ్వాల రాము, సేవాదళ్ మండల అధ్యక్షుడు నాంపల్లి వెంకటాద్రి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల రమేశ్, బుర్రి ముత్యం, తరి రామానుజం, అరె రమేశ్చంద్రా రెడ్డి, పోతరాజు శివరాజం, మాజీ ఉపసర్పంచ్ అసతి పెద్దరాజం, నిర్వాహకులు అరె నరేందర్, కల్లెడ నరేందర్, అన్నరపు రాకేశ్, బర్మ నాగేశ్, అన్నరపు శ్రీకాంత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.
