Husband and wife suicide: నిర్మల్, జనవరి 17 (మన బలగం): నిర్మల్ జిల్లాలో ఘోర ఘటన జరిగింది. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన వెలుగు చూసింది. దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కొమ్మకు భార్యాభర్తలు చీరతో ఉరేసుకున్నారు. వీరిది సారంగాపూర్ మండలంగా తెలుస్తోంది. అక్కడి పోలీసు స్టేషనల్లో వీరు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.