MLC elections: తెలంగాణ బ్యూరో/ మన బలగం: తెలంగాణ శాసన మండలిలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ (Election commission) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించిన 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్నది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతున్నది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒకటి, టీచర్ ఎమ్మెల్సీ రెండు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల టర్మ్ త్వరలో పూర్తికానుంది.
నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025
నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025
నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025
నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025
పోలింగ్: 27 ఫిబ్రవరి 2025
పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు
కౌంటింగ్: 3 మార్చి 2025