Assistant Commissioner of Examinations
Assistant Commissioner of Examinations

Assistant Commissioner of Examinations: ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌గా ముడారపు పరమేశ్వర్

Assistant Commissioner of Examinations: నిర్మల్, మార్చి 20 (మన బలగం): నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్ష సహాయక కమిషనర్‌గా ముడారపు పరమేశ్వర్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారంపేటలో గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ఏసీజీఇగా పనిచేసిన వారు ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడంతో ఈ పోస్టు ఖాళీ ఏర్పడింది. దీనితో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నిర్మల్ జిల్లా విద్యాధికారి పి.రామారావు పరమేశ్వర్‌ను ప్రభుత్వ పరీక్షల సహాయక కమిషనర్‌గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు వెలుపరించారు. ఈ మేరకు ముడారపు పరమేశ్వర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్‌ను జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *