కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళలు
Venugopalaswamy Temple: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులుగా నేత్ర పర్వాంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాలలో భాగంగా గురువారం కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు అర్చన, నిషా చూర్ణోత్సవం, బలిహరణం, ఆవాహనం, బలిహరణం, స్వామి వారి ఎదుర్కోల్లు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే శుక్రవారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రఘురామ శర్మ, నరహరి శర్మ, రవీందర్ శర్మ, రాము శర్మ, బుగ్గ శ్రీనివాస్ శర్మ, బుగ్గ ఆంజనేయులు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.