- రక్త దాన శిబిరం ఏర్పాటు
- కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ
birthday celebrations: బుగ్గారం, ఏప్రిల్ 1 (మన బలగం): మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానులు సుమారు 50 మంది రక్తదానం చేశారు. తదనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేక అభిమానంతో బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై పాట రాయించి ఆయన జన్మదిన సందర్భంగా విడుదల చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.