temple anniversary: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 1 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామలోని రాచర్ల కోటలో నిర్మించిన దాసాంజనేయ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలుఘనంగా జరిగాయి. హనుమాన్ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పురోహితులు రాచర్ల విశ్వనాథ శర్మ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో నిర్వహించిన హోమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు, గ్రామస్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. స్వామి వారిని పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని దర్శించుకున్నారు.