ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
Chhatrapati Shivaji Maharaj Statue Inauguration by MLA Eleti Maheshwar Reddy in Parimandal: మామడ మండలం పరిమండల్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామస్థులు, యువకులు భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, హిందూ ధర్మ రక్షణకు, పాటుపడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, నాయకులు మెడిసెమ్మ రాజు, బాపురెడ్డి, సరికేల గంగన్న, జాలం సింగ్, మల్లేష్, లింగారెడ్డి, మల్లయ్య, నవీన్, చిన్నయ్య, రమేష్, సురేష్, సతీష్, ధర్మాన్న, సంతోష్, రిత్విక్, యూత్ సభ్యులు, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
