KCR’s birthday: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 17 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి, ఒకరికి ఒకరు స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల పాలనలో ఉన్న తెలంగాణను అహింసా మార్గంలో సాధించి.. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి, ప్రజలను ఆదుకున్న కారణజన్ముడు కేసీఆర్ అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతంతో కూడుకున్న వీర్నపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి అనేక యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడానికి అవకాశాల్ని కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడానికి మళ్లీ రావాలని కోరారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాజీ జెడ్పిటిసి కళావతి సురేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కళా తిరుపతినాయక్, బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఎస్ డి ఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆత్మబంధువులు తదితరులు పాల్గొన్నారు.