Constitution Protection March
Constitution Protection March

Constitution Protection March: రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను విజయవంతం చేద్దాం: సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి

Constitution Protection March: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 26 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ (రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర) సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి జావిద్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదనీ, ఇచ్చిన మాటరును నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ 42 శాతం ప్రతిప్రాదించి ఆమోదం తెలిపిందని, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదంపై తెలిపిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్నా అభివృద్ధిని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ప్రతి గ్రామంలో వాడవాడలా తిరుగుతు రాజ్యాంగ పరిరక్షణ గూర్చి, ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి తెలియజేయాలన్నారు. అలాగే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కో ఆర్డినేటర్ వీర్నపల్లి ఇన్‌చార్జి లింగ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్, కరీంనగర్ గిరిజన విభాగం కోఆర్డినేటర్ గజాన్ లాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, డైరెక్టర్లు చంద్ర మౌళి, శ్రీనివాస్, మధన్ లాల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవిందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, యూత్ మండల అధ్యక్షులు తిరుపతి, మండల ఉపాధ్యక్షులు పని కృష్ణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *