BRS Jagityala
BRS Jagityala

BRS Jagityala: కాంగ్రెస్ పాలనలో గాడి తప్పిన గురుకులాలు: తాజా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్

  • పేద పిల్లల ప్రాణాలకు రక్షణ కరువు
  • ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో 30 మంది మృతి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తం

BRS Jagityala: జగిత్యాల, నవంబర్ 30 (మన బలగం): కేసీఆర్ పాలనలో విరాజిల్లిన గురుకులాలు నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో 30 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని తాజా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత సురేశ్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో గురుకుల బాటలో భాగంగా జగిత్యాలోని అల్లీపూర్ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లగా పాఠశాల గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారు. దీంతో గేట్ల ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసి అనంతరం ప్రహరీ గోడ నిర్మాణం పనులు పరిశీలించి విద్యార్థుల వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 500 మంది విద్యార్థులు కలుషితమైన ఆహారం తిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

36 మంది విద్యార్థుల మరణాలకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని శపించారు. గురుకులాల్లో పేద పిల్లల ప్రాణాల‌కు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ర‌క్షణలేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాసిర‌క‌మైన భోజ‌నాన్ని పిల్లల‌కు పెట్టడంతో వారు తీవ్ర అస్వస్థతకు గుర‌వుతున్నారన్నారు. హాస్టళ్లల్లోకి పాములు, ఎలుకలు వస్తుండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. గురుకుల విద్యావ్యవ‌స్థను రేవంత్ స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవ‌రికీ పట్టనట్టుగా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ కలిపి 1,022 గురుకులాలను నెలకొల్పి అందులోనూ అత్యంత వెనకబడిన, అనాథ బాలలకు డిగ్రీ వరకు ఉచితంగా ఉన్నతవిద్యను అందించిందన్నారు.

ఒక్కో విద్యార్థిపైన రూ.ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు చేసి ఉన్నత విద్యను అందించామని అన్నారు. కార్యక్రమంలో రాయికల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేశ్, మండల మహిళ అధ్యక్షురాలు స్పందన సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, రాయికల్ పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్, కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, మహేశ్, మాజీ సర్పంచులు నీరటి శ్రీను, కొంపెల్లి రాజమౌళి, మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు, నాయకులు మోర వెంకటేశ్వర్లు, అనుమల్ల మహేశ్, కంటే గంగారాం, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్, సంజీవ్, ముదం శ్రీను, జలపతిరెడ్డి, రాజ్ రెడ్డి, ఆశాలు, బలరాం, రెండ్ల రాజం, బక్కన్న, శ్రీను, కోరపు రాజం, చంద్ర గౌడ్, మల్లయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *