Rajanna Sirisilla SP
Rajanna Sirisilla SP

Rajanna Sirisilla SP: ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Rajanna Sirisilla SP: ఎల్లారెడ్డిపేట, జనవరి 17 (మన బలగం): నేరాల నివారణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. సత్వర పరిష్కారం కోసం చేపడుతున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన డయల్ 100, షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు. విలేజ్ పోలీస్‌లు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పోలీసుల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించిన క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్‌ను జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఇ-చలాన్ మరియు పాస్‌పోర్ట్ ధ్రువీకరణ మరియు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు పోలీసు అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన మరియు ప్రవర్తనపై ప్రజలు, బాధితులు సద్వినియోగం చేసుకోని పోలీస్ సేవలపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *