Palabhishekam: ఇబ్రహీంపట్నం, జనవరి 17 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుపై సంబురాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణ చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రులు అమిషా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చిత్రపటాలను పాలాభిషేకం చేసారు. కార్యక్రమంలో కోటగిరి ప్రభాకర్, ఎడిపెల్లి భూమన్న, పోతరాజు పెద్దరాజం, దోనికెన రాజేశ్, బెల్లాల రాజం, రాధారపు దేవదాస్, మాలెపు శ్రీనివాస్, కోటగిరి వెంకటస్వామి, అరె రమేశ్ చంద్ర రెడ్డి, గుజ్జె గంగాధర్, దోనికెన మహేందర్, అరె రమేశ్, రాపర్తి దేవేందర్, అరె మల్లయ్య, దోనికెన ప్రశాంత్, తరి గంగారాం, మాలెపు భూమయ్య, కట్కం నారాయణ, పట్నం నర్సయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.