Pawan Kalyan for jagityala: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ తెలంగాణలోని జగిత్యాల పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీన కొండగట్టు అంజన్న దర్శనానికి రానున్నారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు పవన్ తన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికల టీడీపీ, జనసేన కూటమి అనూహ్య ఫలితాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న పవన్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని మొక్కలు చెల్లించుకోనున్నారు. పవన్ రాక ఖరారు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.