Jagityal Collector: ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరు కాని నలుగురు డాక్టర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఓపీ సేవలు, ఐపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీని పరిశీలించారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు.