Selection for state level competitions: ముధోల్, అక్టోబర్ 29 (మన బలగం): మండల కేంద్రమైన ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సరయు అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. క్రీడా సమాఖ్య నిర్మల్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్యాల్లో 28న జరిగిన అండర్ -17 బాలికల కబడ్డీ జోనల్ స్థాయి సెలక్షన్స్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. వచ్చేనెల 3వ తేదీ నుంచి మహబూబ్ నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుంది. విద్యార్థిని ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.