Dharmapuri Temple: ధర్మపురి, జనవరి 10 (మన బలగం): ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశి, రామగుండం ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ సత్య ప్రసాద్తో కలిసి స్వామి వారిని సందర్శించుకున్నార. ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ దేవ దేవుడి ఆశీస్సులు, ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకం పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు.