DGP Jitender: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 1 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. డీజీపీ రాకను పురస్కరించుకొని ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. ముందుగా కొండగట్టుకు విచ్చేసిన డీజీపీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. సాయుద బలగాలచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ జిల్లా స్థితిగతులు, శాంతిభద్రతల గురించి జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, ఆర్.ఐ కిరణ్ కుమార్, మల్యాల సి.ఐ రవి, ఎస్.ఐలు సతీశ్, రవికుమార్ ఉన్నారు.

