- రాజస్థాన్పై సూపర్ విక్టరీ
- 20 పరుగుల తేడాతో గెలుపు
- సంజూ సామ్సన్ ఒంటరి పోరాటం వృథా
Rajasthan vs Delhi, IPL 2024: రాజస్థాన్ రాయల్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. సమిష్టిగా రాణిస్తూ పటిష్ట స్థితిలో ఉన్న ఆర్ఆర్ను కట్టడి చేయడంలో ఢిల్లీ క్యాపిటల్స్ సక్సెస్ అయ్యింది. పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఢిల్లీ బ్యాటర్లు చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 221 పరుగులు చేశారు. 222 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నది.
ఐపీఎల్ 2024 సీజన్ 56వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేసర్, అభిషేక్ పోరెల్ హాస్ సెంచరీలతో రాణించారు.
ఫ్రేసర్ 20 బంతుల్లో మూడు సిక్సులు, ఏడు ఫోర్లతో 50 పరుగులు చేసాడు. అశ్విన్ బౌలింగ్లో ఫెర్రిరాకు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్గా వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన షై హోప్ ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. తరువాత బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేట్ 15, కెప్టెన్ పంత్ 15, స్టబ్స్ 41, గుల్బాద్దీన్ 19, రసిక్ సలామ్ 9, కల్దీప్ 5 పరుగులు చేసారు. అభిషేక్ పోరెల్ 65 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్థాన్ బౌర్లలో అశ్విన్ 3 వికెట్లు, బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.
తరువాత 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ సంజుసామ్సన్ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. రాజస్థాన్ బ్యాటర్స్లో యశశ్వి జైస్వాల్ 4, జోస్ బట్లర్ 19, సంజు సామ్సన్ 86, రియాన్ పరాగ్ 27, శుభమ్ దూబే 25, పోవమ్ పావెల్ 13, ఫెర్రీరా 1, అశ్విన్ 2 పరుగులు చేసారు. ఒక వైపు వికెట్లు పడుతున్న సంజూ ఒంటరి పోరాటం చేసాడు. 46 బంతుల్లో 6 సిక్సులు, 8 ఫోర్లతో విరుచుకు పడ్డాడు. ఒక ఎండ్లో సంజూ వీర విహారం చేస్తున్నా మరో ఎండ్లో సహకారం లభించలేదు. దీంతో రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతే విజయాన్ని నమోదు చేసుకున్నది. రాజస్థాన్ ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి 8 మ్యాచులు గెలిచింది. మూడు మ్యాచులు ఓడింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచులు ఆడి ఆరింటిలో గెలిచింది. ఆరింటిలో ఓడింది. ప్రస్తుతం రాజస్థాన్పై గెలవడంతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానానికి చేరుకుంది. మ్యాచ్లో టాప్ స్కోరర్ సంజూ సామ్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు.