Dharmabhiksam jayanti
Dharmabhiksam jayanti

Dharmabhiksam jayanti: బొమ్మగాని ధర్మభిక్షం పోరాటం, త్యాగం మరువలేనిది: కొయ్యడ సృజన్ కుమార్

Dharmabhiksam jayanti: కరీంనగర్, మనబలగం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం త్యాగం మరువలేదని గీతపనివారల సంఘం జిల్లా నిర్మాణ భాద్యులు కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. శనివారం ధర్మభిక్షం 103వ జయంతిని పురస్కరించుకొని స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ధర్మభిక్షం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిస్వార్థంగా ఉద్యమించిన మహా నాయకుడని అన్నారు. నిజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇచ్చిన తెలంగాణ సాయుధ పోరాట పిలుపును అందుకొనిసాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని వందలాది గ్రామాలను విముక్తి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారని, దున్నే వాడికి భూమి కావాలని వేలాది ఎకరాలను పేదలకు భూములు పంచారని తెలిపారు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా తుది శ్వాస విడిచే వరకు ఎర్ర జెండా నిడన ప్రజా పోరాటాలు నిర్వహించారని, నల్లగొండ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం కోసం గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి సమగ్ర కల్లు గీత విధానం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం, ప్రమాద వశత్తు చెట్టు పైనుంచి పడి మరణించిన గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించడంలో ముందున్నారని, గౌడ జాతికి ధర్మభిక్షం ఆదర్శప్రాయుడని కొనియాడారు. ధర్మభిక్షం ఆశయాల సాధన కోసం హక్కుల రక్షణ కోసం పోరాటలు చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపెల్లి రాజు గౌడ్, బోయిని తిరుపతి, కిన్నెర మల్లమ్మ, బోనగిరి మహేందర్, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ నాయకులు సాంబయ్య, అంజిరెడ్డి, మల్లేశం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *