Celebrations
Celebrations

Celebrations: కాంగ్రెస్ నాయకుల సంబరాలు

Celebrations: ఇబ్రహీంపట్నం, మార్చి 20 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 42% అమలు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు అయినందున జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ చౌక్ వద్ద బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు పాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగాం రాజు, సహకార సంఘం చైర్మన్ అంకతి రాజన్న, మార్కెట్ వైస్ చైర్మన్ ఎలాల వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు గుడ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల రమేశ్, నాంపల్లి వెంకటాద్రి, బుర్రి ముత్యం, క్యాతం తిరుపతి రెడ్డి, అమృత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *