Doddi Komarayya’s Jayanti: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం రైతన్న సాయిధ పోరాటాన్ని కొనసాగించి రజాకర్లను గడగడలాడించిన వీరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. తెలంగాణ పరిపాలిస్తున్న దుండగల నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అన్నారు. ఆయన స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వేచ్ఛ స్వతంతాన్ని సంపాదించిన గొప్ప పులిబిడ్డ అన్నారు. దొడ్డి కొమురయ్య ఆయన చేసిన పోరాటం వలన ఈరోజు రైతంగం భూమి మీద హక్కులు గాని పంట మీద హక్కులు గాని, పశువుల మీద హక్కులు గాని, నీటిమీద హక్కులు గాని కల్పించబడ్డాయని అన్నారు. గొప్ప నాయకుడు దొడ్డి కొమురయ్య యాదవ్ ఆయన యొక్క ఆశయాలను మనమందరం అనుసరించిన వలసిన అవసరం ఉంది. నేటి యువతకు ఆయన ఒక మార్గదర్శకం అని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాట ఫలితం ఈనాడు తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛ స్వతంత్రంగా ఉంటున్నారు ఆయన యొక్క పోరాటం తెలంగాణ ఉద్యమానికి కూడా ఎంతో దోహదపడటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, డైరెక్టర్లు మెండె శ్రీనివాస్ యాదవ్, చెట్పల్లి బాలయ్య, మేడిపల్లి రవీందర్, సూడిద రాజేందర్, నాయకులు చెన్ని బాబు, గంట బుచ్చగౌడ్, మల్లారెడ్డి, బండారి బాల్ రెడ్డి, గంగయ్య, రాజు నాయక్, సతీష్, రవి, రాజయ్య, మూర్తి వెంకటేష్, ఎల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.