Principal Secretary: మంథని ప్రాంతంలోనే దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో దేవాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత రావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.