Road Accident
Road Accident

Road Accident: ఆటో బోల్తా: 11 మందికి గాయాలు

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటో బోల్తా పడగా 11 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వేములవాడ ఏరియా ఆసుపత్రి తరలించారు. అందులో ఒకరి తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్‌కు తరలించారు. మరొకరిని సిరిసిల్లకు తరలించారు. మిగిలిన 9 మందిలో ఇద్దరికి ఎముకలు విరుగగా వారిని ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నారు. మిగిలిన ఏడుగురికి చిన్న గాయాలు కాగా అందరికీ ఎక్స్‌రే తీసి ప్రథమ చికిత్స చేసి పంపారు. జిల్లా వైద్యాధికారి రజిత పరామర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షతగాత్రులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. స్థానిక ఎంఎల్ఏ, విప్ ఆది శ్రీనివాస్ సూపెరింటెండెంట్ పెంచలయ్యకు ఫోన్ చేసి వారికి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యులు పెంచలయ్య, అనిల్, చారి, పరమేశ్వరి ఇతర సిబ్బంది సేవలు అందించారు.

Road Accident
Road Accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *