- కుట్టు మిషన్ అందజేత
- ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశం
- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Distribution of sewing machine: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (మన బలగం): బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయూత అందించి ఆదుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గాజుల శ్రీనివాస్ దివ్యాంగుడు అనారోగ్య కారణాలతో మరణించాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను శ్రీనివాస్ భార్య గాజుల అఖిల వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు జూకి కుట్టు మిషన్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం అందజేశారు. ప్రభుత్వం కుట్టించే యూనిఫాం ఇతర వాటిల్లో ఉపాధి కల్పించాలని డీఆర్డీవోను ఆదేశించారు. తనకు జూకి మిషన్ అందజేసి, ఉపాధి కల్పించాలని ఆదేశించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు గాజుల అఖిల కృతజ్ఞతలు తెలిపారు.