fine rice: మల్యాల, ఏప్రిల్ 3 (మన బలగం): మల్యాల మండలంలోని బల్వంతాపూర్ గ్రామంలో గురువారం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఆనందరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ గడికొప్పుల రమేష్, మాజీ జడ్పీటీసీ దారం ఆదిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడికొప్పుల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు నక్క అనిల్, బొద్దుల లక్ష్మీనారాయణ, తైదల గణేష్, విరబత్తిని ప్రసాద్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేరేల్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.