Whip Laxman: ధర్మపురి, మార్చి 4 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ చౌరస్తాలోని రేషన్ డీలరు షాపు నం.1 వద్ద డీలర్ {సయ్యద్ అలీ (నవాబ్)} ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ లత మరియు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని,ధర్మపురి మండలంలో 39 రేషన్ షాపులకు గాను 18వేల 5వందల 35 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 52వేల 7వందల 96 మంది లబ్ధిదారులకు 3వేల 3వందల 25.57 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నమని,అర్హులైన ప్రతి పేదవారికి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరితగతిన అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని,పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు వారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలని పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారా అని,దరఖాస్తు చేసుకున్న పేదవారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారా అని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 500లకు గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని,సన్నబియ్యాన్ని తీసుకుంటున్న ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,పెద వారికి పంపిణీ చేసే సన్న బియ్యం పంపిణీ విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని,అదే విధంగా రేషన్ డీలర్లు కూడా 5వేల రూపాయల గౌరవ వేతనం,బియ్యం సరఫరాలో తరుగు,హమాలీ ఖర్చులు వంటి కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని,కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.