Nirmal Press Club Executive Committee
Nirmal Press Club Executive Committee

Nirmal Press Club Executive Committee: సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుందాం: నిర్మల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్

Nirmal Press Club Executive Committee: నిర్మల్, జూన్ 21 (మన బలగం): సమన్వయంతో ముందుకు సాగి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని నిర్మల్ ప్రెస్‌క్లబ్ నూతన అధ్యక్షులు రాసం శ్రీధర్ అన్నారు. శనివారం నిర్మల్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం – 2025 – 2027కు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాసం శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా బాస లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా రాంపెల్లి నరేందర్, పూసాల పోశెట్టి, యోగేష్, ఇఫ్తేకర్ అహ్మద్, కోశాధికారిగా కోడూరు సందీప్, సాహకోశాధికారిగా రామెల్ల రాజేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శిగా బొడ్డు వేణుగోపాల్ గౌడ్, కార్యదర్శులుగా మండాజీ మారుతి, బొద్దుల భాను, వసీవుల్లా ఖాన్, ప్రచార కార్యదర్శిగా శివకుమార్, కార్యనిర్వహణ కార్యదర్శిగా జగన్నాథం శ్రీనివాసా చారి, సంయుక్త కార్యదర్శిగా వాకులాభరణం ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా జల్దా మనోజ్, బత్తూరి కైలాస్, చందుల సాయన్న, పసుపుల రాజేశ్, మోసిన్ బిన్ మహమ్మద్, గౌరవ సభ్యులుగా ధర్మపురి శ్రీనివాస స్వామి, కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య, రామ్ మహేందర్, మహేశ్ రావు, గుమ్ముల అశోక్, రామేశ్వర్, ఎమ్మే వసీం, ముఖిమ్‌లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని సభ్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *