cable bridge
cable bridge

cable bridge: తీగల వంతెన పనుల నాణ్యతపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నాము

అవినితిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: సీపీఐ

cable bridge: కరీంనగర్ నగర శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తీగల వంతెన నాణ్యత ప్రమాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను స్వాగతిస్తున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు తెలిపారు. తీగల వంతెనకు మొదట రూ.80 కోట్లు కేటాయించగా అవి సరిపోవని బీఆర్ఎస్ నాయకులు అప్పటి మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.224 కోట్లకుపైగా నిధులు కేటాయించి నిర్మాణం పూర్తికాకముందే ప్రారంభించారని తెలిపారు. కొన్ని రోజులకే రోడ్డు పగుళ్లు రావడం, లైట్లు వెలగకపోవడం, ఒక బ్రిడ్జ్ కొంతమేర కుంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. హడావుడిగా గత ప్రభుత్వం ఈ తీగల వంతెన నిర్మాణం చేసిందని ఆరోపించారు. వంతెనపై నిత్యం ఏదో ఒక చోట నాణ్యత లోపించి మళ్లీ పనులు జరుగుతున్నాయని, తీగల వంత నిర్మాణంలో జరిగిన అవినీతి అక్ర అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులైన కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన తీగల వంతెన నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ అక్రమాలు చేశారని, వీరిని విజిలెన్స్ అధికారులు పిలిచి విచారణ జరిపించాలని కోరారు. కరీంనగర్ నగర ప్రజలకు తీగల వంతెన రెండు వైపులా అందుబాటులోకి తీసుకురావాలని, లైట్లు వెలిగేలా నగర పాలక సంస్థ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సురేందర్ రెడ్డి పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *