Awareness: నిర్మల్ పట్టణంలోని రామ్నగర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం ఎంసీహెచ్, ఐసీటీసీ, డీఎస్ఆర్సీ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్, సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బాధితులు నిపుణుల సూచనలు పాటించడంతోపాటు క్రమం తప్పకుండా మందులు వాడడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజమౌళి ఏఎన్ఎం కళ్యాణి, కౌన్సిలర్లు ఎల్లేష్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
