Bonalu: కడెం, ఫిబ్రవరి 23 (మన బలగం): కడెం మండలం పెద్దూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామికి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దూర్ గ్రామంలో గల శ్రీ మల్లికార్జున స్వామికి ప్రతి యేటా బోనాలు చెల్లించి పట్నాలు వేయడం అనవయితీగా వస్తోంది. ఈ సంవత్సరం పెద్దూర్ గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలతో ఊరేగింపుగా వచ్చి మల్లన్న ఆలయంలో స్వామివారికి సమర్పించారు. ఒగ్గు పూజరులచే ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.