Concluded League Cricket Tournament
Concluded League Cricket Tournament

Concluded League Cricket Tournament: ముగిసిన లీగ్ క్రికెట్ టోర్నీ

Concluded League Cricket Tournament: ధర్మారం, జనవరి 5 (మన బలగం): ధర్మారం మండలం ఖమ్మర్ఖాన్ పేట గ్రామంలో కొనసాగుతున్న ఖమ్మర్ఖాన్ పేట ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. విజేత జట్లకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. టోర్నీలో విజయం సాధించిన అన్నారం జట్టుకు రూ.30 వేల నగదుతో పాటు ట్రోఫీని, రన్నరప్‌గా నిలిచిన ఖమ్మర్ఖాన్ పేట జట్టుకు రూ.15 వేల నగదుతోపాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా టోర్నీలో విజయం సాధించిన జట్టు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *