Burning of effigies: ఎల్లారెడ్డిపేట, మార్చి16 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రజలు తమ తీర్పుతో ప్రభుత్వం నుంచి దించివేసినా బీఆర్ఎస్ నాయకుల అహంకారం తగ్గటం లేదన్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించే రీతిలో మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పేమిటి అని అన్నారు. గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మార్షల్తో అసెంబ్లీ బయట వరకు గెంటి వేయించిన ఉదంతాలను సమాజం మర్చిపోలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన చూస్తుంటే ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతుండడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కనీసం సమస్యలపై చర్చించే ప్రతిపక్షం హోదాను వారు స్వీకరించకపోవడం గమనార్హం అన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా కొట్లాడడం నేర్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, నారాయణరెడ్డి, చెట్టుపల్లి బాలయ్య, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు, గంట బుచ్చ గౌడ్, అనవేణి రవి, మల్లారెడ్డి, దేవయ్య, రాజు నాయక్, పరశురాములు, బాలు యాదవ్, ఎల్లాగౌడ్, రమేష్, నారాయణ, రవి, బండారి బాల్ రెడ్డి, సంతోష్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.