Ayyappa Temple
Ayyappa Temple

Ayyappa Temple: అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

Ayyappa Temple: ఇబ్రహీంపట్నం, మార్చి 16 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ 29వ వార్షిక ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఆలయ వ్యవస్థాపకులు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజమ్మ దంపతుల ఆధ్వర్యంలో 1996లో కల్వకుంట్ల పాపారావు-సత్తమ్మల జ్ఞాపకార్థం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించారు. ప్రతి సంవత్సరం హోలీ సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. యజ్ఞ అర్చకులు నారబట్ల హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో మూలవిరాఠ్‌లకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. 108 పాదులతో ఆలయంలో ఉత్సవమూర్తులు గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం యజ్ఞం చేసి, అష్టదిక్కుల్లో బలిహరణ కార్యక్రమం బజాభజంత్రీలతో నిర్వహించారు. సుగంద ద్రవ్యాలతో ఆలయ గోపురానికి అభిషేకం చేసి, యజ్ఞ పుర్ణాహుతి చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక హారతులు ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షుడు దొమ్మటి ప్రవీణ్, కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షులు గంగుల వివేక్, మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఆలయ మాజీ అధ్యక్షులు కోట బుచ్చి గంగాధర్, అంకతి భరత్ కుమార్, చెపురి రాము, చింత లవకుమర్, చిలమంతుల శివ కుమార్, బండారి మారుతి, అర్చకులు అశోక్ శర్మ, శుక్ల సాగర్ శర్మ, నారంభట్ల భరద్వాజ శర్మ, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *