Student talent in social science: ఇబ్రహీంపట్నం, జనవరి 5 (మన బలగం): జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవా పరీక్షలో ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భార్గవి, సమీర మండల ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. కాగా జిల్లాలో ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. కాగా ప్రధానోపాధ్యాయుడు కోదండపాని, సోషల్ ఉపాధ్యాయుడు కోల రమేశ్ విద్యార్థులను అభినందించారు.