Burning of UGC draft copies
Burning of UGC draft copies

Burning of UGC draft copies: యూజీసీ కొత్త మార్గదర్శకాలను విరమించుకోవాలి

  • యూనివర్సిటీల స్వయం ప్రతి పత్తి కాపాడాలి
  • ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్

Burning of UGC draft copies: జగిత్యాల ప్రతినిధి, జనవరి 9 (మన బలగం): యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాలలో ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ నూతన డ్రాఫ్ట్ మార్గదర్శకాల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ఉపాధ్యాయులు, అకాడమిక్ సిబ్బంది నియామకం, ప్రమోషన్ కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ కోసం చర్యలు ఈ నిబంధనలను తక్షణం తిరస్కరించాలని, యూజీసీ ముసాయిదా నిబంధనలు 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్, వైస్ చాన్స్‌లర్ పోస్టుల నియామక నిబంధనలను సవరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జాతీయ అర్హత పరీక్ష నెట్ ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలలో తప్పనిసరి కాదు అని సూచనలు ఇస్తోందన్నారు. ఈ ప్రకారం కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ ఉన్న అభ్యర్థి నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రిక్రూట్ చేయబడతారని, అదే జరిగితే వీసీ పోస్టుల నియామకానికి ఎలాంటి అకాడమిక్ విద్యా అర్హతలు లేకున్నా ఈ ముసాయిదా కమిటీ ప్రకారం వైస్ ఛాన్స్‌లర్‌ను నియమిస్తారని చెప్పారు.

ఈ నిబంధనలను ఎస్ఎఫ్ఐ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నత విద్యలో ఒక నిరంకుశమైన మార్పులు ప్రతి ఆరు నెలలకు యూజీసీ గైడ్‌లైన్స్ మార్పులు చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. అలాగే యూజీసీ 2025 డ్రాఫ్ట్ ప్రకారం ఉన్నత విద్యలో ఎలాంటి అర్హత, టీచింగ్ అంటే ఏంటో తెలియని వాళ్లని ఈ ఈరోజు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, వీసీలుగా రిక్రూట్ చేస్తుండడం బాధాకారమ్మన్నారు. అలాగే ఈ మార్పులు యూజీసీ గైడ్‌లైన్స్‌గా లేవని ఇవి ఒక రాజకీయ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిబంధనలుగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ముసాయిదా యూజీసీ 2025 ప్రకారం పరిశ్రమ నిపుణులు, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సీనియర్ ప్రొఫెషనల్ వీసీలుగా నియమించబడుతారని దీనివల్ల భవిష్యత్తులో ఉన్నత విద్యలో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని చెప్పారు. ఉన్నత విద్యలో ఇలాంటి మార్పులు చేయడం వల్ల దేశంలో అశాస్త్రీయమైన భావనలు ఏర్పడతాయని నొక్కి చెప్పారు. ఈ మార్గదర్శకాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని లేని, ఎడల దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్, వరుణ్, కార్తీక్, రిషిధర్ చందు, నిమిత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *