Student field trip: మనబలగం, వీర్నపల్లి: వీర్నపల్లి మండలం గర్జనపల్లి తండా, బంగిరెడ్డి తండా ప్రాథమిక పాఠశాలల చిన్నారులు గురువారం క్షేత్ర పర్యటన చేశారు. మండలం లోని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, ఎం ఈ ఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ కార్యాలయం, నర్సరీ సందర్శించి వాటి పని తీరు తెలుసుకున్నారు. ఆయా శాఖల పని తీరు గురించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుగులోత్ తిరుపతి జాదవ్, మాలోత్ కావేరి, ఉపాధ్యాయులు నిర్మల, సుమలత, మంజుల, వినీత తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల చిన్నారులను క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను వీర్నపల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ అభినందించారు. ఇలాంటి పర్యటనలు పాఠశాల చిన్నారుల్లో ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
