Kabaddi: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన కమటం కార్తీక్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి 7వ తేదీ వరకు ఆదిలాబాద్లో జరిగే సీనియర్ 71వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో సిరిసిల్ల జట్టు తరఫున పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల్లో పాల్గొనబోతున్న కార్తీక్ను మండల ప్రజా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ అభినందించారు.