- ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు
- ఆలయంలో యజ్ఞం ప్రారంభించిన అర్చకులు
Bramhotsavalu: ఇబ్రహీంపట్నం, మార్చి 12 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని అతిపురాతన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఆలయంలో యజ్ఞ అర్చకులు చక్రపాణి నర్సింహమూర్తిచార్యులు స్వామివారి మూలవిరాటు, ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని యజ్ఞమండపంలో స్వామి వారిని ఆవాహనం చేసి శాంతి యజ్ఞం ప్రారంభించారు. అనంతరం
స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బర్మ మల్లయ్య, ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీనివాస్, కోశాధికారి గుడ్ల శ్రీధర్, రైటర్ కత్రోజి సాయికృష్ణ, కమిటీ సభ్యులు రాధారపు దేవదాస్, ఆరె వినయ్, తొపారపు ప్రభాకర్, రౌతు నర్సయ్య, సున్నం భూమన్న, దొనికెన గంగన్న, దాసరి రాజు, రాసమల్ల లక్ష్మి రాజం, పాతర్ల రెడ్డి, సుంకిసాల ధర్మాగౌడ్, మగ్గిడి గంగారాం, బుక్య దత్తాద్రి, బండమీద బుచ్చన్న, ఆలయ అర్చకులు మంత్ర రాజం శ్రీనివాసాచార్యులు, మంత్రరాజం జానకిరామకృష్ణాచార్యులు, మంత్రరాజం అరవింద్ కృష్ణా చార్యులు, సాముజి నవీన్ చార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.