Praja Palana Samburalu: నిర్మల్, డిసెంబర్ 3 (మన బలగం): ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రైతు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని తెలిపారు. రైతులు పండించిన సన్న రకం బియ్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శించిన సరికాదని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి అబ్దుల్ హది, రామేశ్వర్ రెడ్డి, సోనియా సంతోష్, మామడ ఎంపీపీ జైసింగ్, రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, కుంట వేణుగోపాల్, వోడ్నాల రాజేశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, నాయకులు ఈటల శ్రీనివాస్, వోస రాజేశ్వర్, అతీక్ అహ్మద్, వాజిద్ అహ్మద్, సభ కలీం మజర్, మహిళా నాయకురాలు వాణి రెడ్డి, చిన్ను, అజహరుద్దీన్, ,మతీన్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.