Saibaba Temple Committee: నిర్మల్, డిసెంబర్ 24 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి బాబా ఆలయ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప కమిషనర్ వరంగల్ జోన్ శ్రీకాంత్ రావు ఉత్తర్వుల ప్రకారం దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్గా గంగోని బూరాజ్, ధర్మకర్తలు మనోజ్ కుమార్, జొన్నల మనోహర్, కత్తి సురేశ్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆనంద్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావుకు నూతన చైర్మన్ ధన్యవాదములు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. ఇందులో ఆలయ ఈవో రమేశ్, దేవరకోట ఆలయ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.